ELR: జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం ఏలూరు జిల్లాలోని డీఆర్సీ మీటింగ్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వెళ్తుండగా కలపర్రు టోల్ ప్లాజా వద్ద ఇద్దరు మహిళలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన మహిళలకు ఆయన దగ్గరుండి వైద్య సహాయం అందించి, 108లో మెరుగైన వైద్యానికి ఏలూరు తరలించారు.