WNP: జిల్లా కేంద్రంలోని 33/11 కేవీ ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని TGSPDCL ఏఈ సుధాకర్ తెలిపారు. బాలానగర్ 33/11 కేవీ ఉపకేంద్రం నుంచి విద్యుత్ సరఫరా అయ్యే ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.