VSP: క్రిస్టియన్ మైనార్టీ నేత సొండి సుధాకర్ బాబు బుధవారం 32వ వార్డు అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కండువా వేసి స్వాగతించారు. మైనార్టీలపై కూటమి అన్యాయంతో వైసీపీలో చేరానని సుధాకర్ చెప్పారు. జగన్ నేతృత్వం రాష్ట్రానికి అవసరమని, వాసుపల్లి సేవలు తనను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.