TPT: శ్రీకాళహస్తి బేరివారి మండపం వద్ద ఆగ్నేయ గణపతి స్వామి విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం నేడు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తుల జయజయధ్వానాల మధ్య ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పట్టణమంతా భక్తిభావంతో పులకించిపోయింది. ఈ కార్యక్రమంలో BJP స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కోలా ఆనంద్, దేవస్థానం EO బాపిరెడ్డి, దేవస్థానం ఛైర్మన్ కొట్టే సాయి పాల్గొన్నారు.