CTR: సదుం మండలంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పర్యటించారు. పొట్టెంవారిపల్లి చీకల చేను గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలలో నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. చీకలచేనులో గాయపడ్డ పార్టీ నాయకుడు రామ్మూర్తిని పరామర్శించారు.