MDK: మహిళలని కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ చేపట్టారు. జిల్లాకు రూ. 30 కోట్లు, నియోజకవర్గానికి 2.88 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.