నీరజ కోన దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ‘తెలుసు కదా’ చిత్రం కథ తనదే అంటూ ఓ యువకుడు SMలో కొన్ని సాక్ష్యాలను బయటపెడ్డాడు. 2020లో సమంతకు తాను స్టోరీ చెప్పినట్లు అతడు తెలిపాడు. ఆ కథను సమంత తన స్నేహితురాలు నీరజ కోనకు చెప్పడంతో, ఆమె కథలో చిన్న మార్పులు చేసి ఈ సినిమా తిసినట్లు పేర్కొన్నాడు. కథలను ఇతరులకు చెప్పే ముందు జాగ్రత్తగా అంటూ సూచించాడు.