NLR: విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీఐఐ సమ్మిట్ విజయవంతం కావడంపై సోమవారం నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు.