HYD: నగరంలో కల్తీ దందాను అరికట్టేందుకు సీపీ వీసీ సజ్జనార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఐదుగురు ఎస్సైలు, 25 మంది కానిస్టేబుళ్లతో ‘యాంటీ ఫుడ్ అడల్టేషన్ టీమ్’ను ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా 7 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో రూ. 4 కోట్ల విలువైన కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకుని, 10 మందిపై కేసులు నమోదు చేశారు.