ADB: టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టుపై అద్భుత విజయం సాధించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి క్రికెట్ అభిమానులు సంబరాలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు చేపట్టారు. జాతీయ జెండా పట్టుకొని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో హోరెత్తించారు.