పుంగనూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రూ.59 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధితో రైతులకు సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.