MHBD: జిల్లా కేంద్రంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా MLA మురళి నాయక్, MP బలరాం నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు. రేవంత్ సర్కార్ మహిళలకు దేశంలోనే అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, గౌరవం, రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.