తిరుపతి ఎస్వీయూలో రూసా–2 కింద 15 రోజుల డీజీసీఏ-ఆర్పీటీఓ డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య టాటా నరసింగరావు ప్రారంభించారు. డ్రోన్ ఆపరేషన్లు, మ్యాపింగ్, నిఘా, సర్వే వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వనున్నారు.మొదటి రెండు బ్యాచుల్లో మొత్తం 40 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.