MNCL: జైపూర్ మండలం వేలాలకి చెందిన బండి నర్సయ్య అనే రైతు పొలం పనులకు వెళ్లగా ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలకు తగిలి కరెంట్ షాక్కు గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్కు ఫోన్ చెయ్యగా భీమారం 108 సిబ్బంది ఈఎంటి రమేశ్, పైలట్ సిరాజోద్దీన్ అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.