PLD: పల్నాడు జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో నిర్మాణ నష్టం, నీరు నిలిచిపోవడం వంటి భద్రతా సమస్యలు తలెత్తితే, విద్యార్థులను వెంటనే సురక్షిత గదులకు తరలించాలని హెచ్ఎంలను, ప్రిన్సిపాళ్లను ఆమె ఆదేశించారు.