ASF: కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 2026-27 సంవత్సరానికి గాను తైబజార్, పశువుల వధశాల ఫీజు వసూలు హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ వేలం ఈనెల 13న మున్సిపల్ కార్యాలయంలో చేపట్టనున్నారు. ఈ వేలంలో పాల్గొనే వారు తమ ఆస్తి పన్ను, నీటి పన్నును మార్చి 31, 2026 వరకు చెల్లించి ఉండాలని అధికారులు తెలిపారు.