KNR: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 3, 4, 5, 6, డివిజన్లలో మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ శనివారం పర్యటించారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గల్లీల్లో పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులను, డ్రైనేజీలను నిశితంగా పరిశీలించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి తాగునీరు, వీధి దీపాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.