ASF: కాగజ్నగర్ పట్టణం గాంధీ పార్క్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా MLC దండే విఠల్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. మహిళా సాధికారత కేవలం ఆర్థికాభివృద్ధి తోనే కాకుండా, సామాజిక చైతన్యంతో కూడా సాధ్యమవుతుందన్నారు.