MDK: జిల్లా కేంద్రంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ఆధ్వర్యంలో శనివారం సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాభివృద్ధి దిశగా సర్పంచ్ల పాత్రపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. పంచాయతీ పాలనలో పారదర్శకత, సమర్థత అవసరాన్ని అధికారులు వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచనలు అందించారు.