SDPT: హుస్నాబాద్ పట్టణంలోని ఎంఈవో కార్యాలయంలో మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి మనీలా హాజరై మహిళ ఉపాధ్యాయులని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మహిళామణుల గురించి గొప్ప పాటలను పాడారు.