PPM: పర్యాటక రంగానికి చిరునామాగా మారుతున్న సీతంపేటలోని ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్కులో కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి శనివారం సందడి చేశారు. పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆకర్షణీయమైన ఫ్లవర్ గార్డెన్ను ఆయన రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. వివిధ రకాల దేశీ, విదేశీ పుష్పాలతో ముస్తాబైన ఈ గార్డెన్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు.