KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో తిరుమల శ్రీవారి పోటు నుంచి తెప్పించిన లడ్డూలు 600 అందుబాటులో ఉన్నాయని ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ శుక్రవారం తెలిపారు. రామయ్య దర్శనానికి శనివారం రానున్న భక్తులకు ఒక్కో లడ్డూ రూ.50 చొప్పున విక్రయిస్తారని చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.