సత్యసాయి: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ ఆక్రమణల వ్యవహారంలో సీఎస్ సాయిప్రసాద్ కీలక చర్యలు తీసుకున్నారు. వైసీపీ హయాంలో ఆయనకు సహకరించిన ఎమ్మార్వోలు యుగేశ్వరీదేవి, నీలకంఠారెడ్డిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడిన అంశంపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.