ADB: ఆదివాసి గిరిజన ప్రజల అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కుష్బూ గుప్తా తెలిపారు. సోమవారం ఉట్నూర్ పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆదివాసి, గిరిజన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.