ATP: నియోజకవర్గంలో బెల్ట్ షాపులు, కల్తీ మద్యం విక్రయాలు ఆపకపోతే మహిళా విభాగం ఆధ్వర్యంలో దాడులు చేస్తామని కళ్యాణదుర్గం YSRCP సమన్వయకర్త తలారి రంగయ్య హెచ్చరించారు. పేదల డబ్బు మద్యం ద్వారా తెలుగుదేశం నాయకుల జేబుల్లోకి వెళ్తుందని విమర్శించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.