HYD: జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం మొదటిరోజు విజయవంతంగా పూర్తయింది. మొదటిరోజే 92 శాతం మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకట్ తెలిపారు. మొత్తం 2,586 పోలియో కేంద్రాలు, 91 మొబైల్ టీమ్స్ ద్వారా 4,75,858 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసామన్నారు.