HNK: నగరంలోని భీమారం బస్టాప్ వద్ద శనివారం ఉదయం వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టి, అదే వేగంతో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కన్నం రాణి (45) కాలు నుజ్జునుజ్జు అయిపోయింది. ఆటో డ్రైవర్ జనార్దన్ చేతికి, మంద విక్టోరియాకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.