KNR: శంకరపట్నం మండలంలోని కొత్తగట్టులో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైస్మిల్లు యజమాని తణుకు స్వప్న తన నివాసంలోని స్నానాల గదిలో చున్నీతో ఉరేసుకుంది. తెల్లవారుజామున స్నానానికి వెళ్లిన ఆమె ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించి చూడగా మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.