ADB: ఆదిలాబాద్లో ఎయిర్ పోర్టు మ్యాప్ పై క్లారిటీగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల ప్రజలు కోరారు. నేరడిగొండలో ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు. దీంతో ఎమ్మెల్యే సానుకులంగా స్పందిస్తూ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రైతులు, ఇండ్లు, ప్లాట్లు బాధితుల సమస్యలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు.