సిద్దిపేట నుంచి హనుమకొండ ప్రయాణించిన శోభారాణి అనే మహిళ నాలుగు తులాల బంగారం ఉన్న బ్యాగును బుధవారం ఆర్టీసీ బస్సులో మర్చిపోయింది. హనుమకొండలో దిగిన తరువాత ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆర్టీసీ అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు ఆ బ్యాగును హుస్నాబాద్ బస్టాండ్లో స్వాధీనం చేసుకుని, సురక్షితంగా మహిళకు అందించారు.