NZB: సామాన్య ప్రజలంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకంత కోపమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. బస్సు ఛార్జీల పెంపుపై ఆమె ఆదివారం ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. ఇటీవల బస్సు పాస్ ధరలు పెంచి చిరుద్యోగులపై పెనుభారం మోపారన్నారు. ఇప్పుడు బస్సు ఛార్జీలను అమాంతం పెంచేశారని మండిపడ్డారు. బస్సు ఎక్కడమే పాపం అన్నట్లుగా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారన్నారు.