కడప: జిల్లాలో భారత ప్రభుత్వం చేపట్టనున్న జనగణన-2027 ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కలెక్టరేట్లో కలెక్టర్ శ్రీధర్ జ్యోతి ప్రజ్వలనతో సెన్సస్ అధికారులకు తొలి విడత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 1 నుంచి 30 వరకు హౌస్ లిస్టింగ్, డిజిటల్ యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.