KNR: మానకొండూర్ మండలం రంగంపేటలో శ్రీ మేడలంబ కేతకాంబ సమేత మల్లిఖార్జున స్వామి నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయ నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించి, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.