అన్నమయ్య: తంబళ్లపల్లె RTC బస్టాండ్ వెనక వైపున డ్రైనేజీ కాలువల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. డ్వామా PD వెంకటరత్నం ఆధ్వర్యంలో అధికారులు, కూటమి నాయకులు ఇవాళ భూమిపూజ చేశారు. రూ. 30 లక్షలతో పనులు చేస్తున్నామని ప్రత్యేక అధికారి రెడ్డెప్ప, PR డీఈ మునిరాజు కుమార్ తెలిపారు. నెలాఖరుకల్లా పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో APO అంజనప్ప, AE వెంకటరమణ, పాల్గొన్నారు.