రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. రిలయన్స్ పవర్తో పాటు దాని అనుబంధ సంస్ధలపై ఈడీ ఏకకాలంలో దాడులు చేసింది. నగదు అక్రమ చలామణి కేసులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సోదాలు పూర్తయిన తర్వాత ఈడీ అధికారిక ప్రకటనను విడుదలు చేసే అవకాశం ఉంది.