KRNL: ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇవాళ పోలీసు అధికారులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు, నేర చరిత్రులకు, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.