AP: తిరుమలలో గరుడ వాహనసేవ ప్రారంభమైంది. తిరుమాడ వీధుల్లో కన్నుల పండువగా గరుడ సేవ కొనసాగుతోంది. ఈ క్రమంలో గరుడ సేవను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. మాడవీధుల్లో గ్యాలరీల్లో రెండు లక్షల మంది భక్తులు బారులు తీరారు. వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ అధికారులు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. తిరుమలలో పూర్తిగా వాహనాల పార్కింగ్ ప్రాంతాలు నిండిపోయాయి.