NLR: దేవి శరన్నవరాత్రులులో భాగంగా ఉదయగిరి శ్రీ పార్వతీ సమేత శివాలయంలో అమ్మవారు ఏడవ రోజు మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అనిల్ మాట్లాడుతూ.. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహంకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి, త్రిశక్తి స్వరూపిణిగా మహాచండీ అవతారం ఉద్భవించింది అన్నారు.