VSP: రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే, అక్టోబరు 10న లక్షమంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో విజయవాడ మార్చ్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక (జేఏసీ) ప్రకటించింది. సింహాచలంలో ఆదివారం జరిగిన ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ జానీ పాషా ఈ హెచ్చరిక చేశారు.