TPT: తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ మౌర్య తెలిపారు. ఈ ఇందులో భాగంగా సెప్టెంబర్ 29 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిర్యాదుల వేదిక, ఉదయం 10.30 నుంచి 11.30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు.