మేడ్చల్: ఉప్పల్ మినీ శిల్పారామంలో జరుగుతున్న మన గుడి మన బలం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను గురుకుల అడ్వైజర్ నల్ల రాధాకృష్ణ కలిసి హాస్టల్ సప్లై దారుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, అశోక్, హరిబాబు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.