కాకినాడ జిల్లాలో త్వరలో చేపట్టనున్న జనగణనపై ఈనెల 6 నుంచి 8 వరకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ షాన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు ల్యాప్ ట్యాప్లతో హాజరుకావాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జనగణనపై పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.