BHPL: మహదేవపూర్ (M) కాళేశ్వరంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. గురువారం 7,09,850 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైనట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బుధవారం నుంచి గురువారం వరకు 1,57,000 క్యూసెక్కుల వరద పెరిగింది. సుందిళ్ల పార్వతి బ్యారేజ్, ఎల్లంపల్లి, అన్నారం ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.