KMM: కూసుపంచి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఆ మొత్తాన్ని ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులకు మంత్రి అందజేశారు. రామాలయం నిర్మాణానికి విరాళం అందజేసిన మంత్రి పొంగులేటికి నేతలు, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.