NLG: హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ఖాయమని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.