KNRL: కోడుమూరు MLA దస్తగిరి, కేడిసీసీ బ్యాంక్ ఛైర్మన్ విష్ణువర్థన్ రెడ్డి ఆదేశాల మేరకు సీ. బెలగల్ మండలం కంపాడు ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ జడ్పీటీసీ చంద్రశేఖర్ జల హారతి ఇచ్చారు. స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మోటర్లు ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ కుంట చూసిన నీటితో జలకళను సంతరించుకుందన్నారు.