SRD: మండల కేంద్రమైన ఝరాసంగంలోని శ్రీ కేతకి ఆలయంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశ్వయుజ మాసం, శుక్లపక్షం విదియ పురస్కరించుకొని పార్వతి సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళహారతి నైవేద్యం నివేదన చేశారు.