W.G: రాష్ట్ర పారిశ్రామిక రూపురేఖలు మారుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరంలో గురువారం ఆయన మాట్లాడారు. ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు ఆర్సెలార్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ఆధ్వర్యంలో రూ.1.5 లక్షల కోట్ల భారీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటు భూమిపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. మోదీ, చంద్రబాబు, కుమారస్వామిల సమష్టి కృషితో ఇది సాధ్యమైందన్నారు.