ATP: అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం జిల్లాలో 37.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.