KDP: చీనీ సాగు రైతులకు కలసి రావడం లేదు. సాగులో నష్టాలు తప్ప లాభాలు రాకపోవడంతో దీర్ఘకాలిక పంటలతో ఆదాయం ఉంటుందనుకున్నా రైతులకు నిరాశే మిగిలింది. వేముల మండలంలో 2 వేల ఎకరాల్లో రైతులు చీని సాగు చేసినట్లు తెలిపారు. భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంవల్ల చీని చెట్లు వాడులేక పూత రావడం లేదన్నారు. సాగులో నష్టాలు వస్తున్నాయన్నారు. దీంతో చేసేదేమిలేక చెట్లను తొలగిస్తున్నారు.